సాయి తేజ్ “రిపబ్లిక్” ట్రైలర్ కి భారీ రెస్పాన్స్…5 మిలియన్ ప్లస్ వ్యూస్ తో..!

సాయి తేజ్ “రిపబ్లిక్” ట్రైలర్ కి భారీ రెస్పాన్స్…5 మిలియన్ ప్లస్ వ్యూస్ తో..!

Published on Sep 23, 2021 9:16 PM IST


సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ కి 5.4 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం లో జగపతి బాబు, రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

జేబి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగం గా చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక కి పవన్ కళ్యాణ్ సైతం వస్తుండగా, సినిమాను అక్టోబర్ 1 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు