మహేష్ సరసన ఏ హీరోయిన్ నటిస్తోందో..?

మహేష్ సరసన ఏ హీరోయిన్ నటిస్తోందో..?

Published on Apr 1, 2020 2:00 AM IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాక కూడా పరుశురామ్ తన తరువాత సినిమా కోసం చాల టైం తీసుకున్నాడు. అయితే అంత టైం తీసుకున్నందుకు పరుశురామ్ కి భారీ ఆఫరే దక్కింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ను కొట్టేశాడు. కాగా ఈ సినిమాలో కథానాయకురాలిగా కీర్తి సురేష్ నటించబోతుందని ఇటివలే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాలలో కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోమని మహేష్ పరుశురాంకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి కీర్తి, కియారాలో, సూపర్ స్టార్ పక్కన ఎవరు రొమాన్స్ చేయనున్నారో చూడాలి.

ఇక మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న పరుశురామ్, మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లితో చేయాలనుకున్న సినిమాను కూడా మహేష్ లైన్ లో పెట్టారని.. కాకపోతే అది వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు